ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగమవుతాం
NEWS Jan 23,2025 03:59 am
దావోస్ వేదికగా సంచలన ప్రకటన చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగం అవుతామని ప్రమాణం చేశారు. పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకుంటామని పేర్కొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో భాగంగా తెలంగాణ పెవిలియన్ ను సందర్శించారు వన్ ట్రిలియన్ ట్రీ ఆర్గనైజేషన్ నిర్వాహకులు. తెలంగాణ రైజింగ్ విధానంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం.