Logo
Download our app
ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం
NEWS   Jan 23,2025 03:50 am
టీజీఎస్​ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది ఆర్టీసీ యాజమాన్యం. ఎలక్ట్రిక్ బస్సుల మెయింటనెన్స్‌, చార్జింగ్‌ మినహా ఆపరేషన్స్‌ అంతా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని వెల్లడించింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సంస్థ పూర్తిగా ప్ర‌భుత్వానికి చెందిన‌ద‌ని, ప్రైవేట్ కార్య‌క‌లాపాల‌కు చోటు ఉండ‌ద‌ని పేర్కొంది. ఉద్యోగులు, సిబ్బంది ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని కోరింది.
⚠️ You are not allowed to copy content or view source