Logo
Download our app
మున్సిపల్ చైర్పర్సన్ కు పాలాభిషేకం
NEWS   Jan 22,2025 06:53 pm
కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 4 సంవత్సరాల నుంచి బకాయిపడ్డ పిఎఫ్, ఇఎస్ఐతో పాటు 3నెలల వేతన బకాయిలు విడుదల చేయించారు. కార్మికులకు పెండింగ్ వేతనాలు నాలుగున్నర కోట్లు విడుదల చేయడం పట్ల మున్సిపల్ కార్మికులు చైర్మన్ గడ్డం ఇందుప్రియ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. సమాన వేతనంతో పాటు పెండింగ్ వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ పెండింగ్ డబ్బులు చెల్లించడం మున్సిపల్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఏ మున్సిపల్ చైర్మన్ చేయని విధంగా విడుదల చేశారన్నారు.
⚠️ You are not allowed to copy content or view source