పిల్లల భద్రతే మాకు ముఖ్యం: ఎస్పీ
NEWS Jan 20,2025 06:11 pm
జిల్లాలోని రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పాఠశాలల స్కూల్ బస్సు డ్రైవర్లకు వాహనాల ఫిట్నెస్, రోడ్డు సేఫ్టీ పలు అంశాలపై జిల్లా ఎస్పీ.అశోక్ కుమార్,.ఎం.వి.ఐ.శ్రీనివాస్ తో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం, పిల్లల భద్రతే ముఖ్యమని అన్నారు. స్కూల్ వాహనాలకు ఎలాంటి ప్రమాదాలు జరిగిన సంబంధిత డ్రైవర్, యాజమాన్యంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.