వరుసగా చైన్స్నాచర్ల హల్చల్
NEWS Jan 18,2025 08:11 am
భిక్కనూరు, రాజంపేట మండలాల్లో పట్టపగలే చైన్స్నాచర్లు హల్చల్ చేశారు. జంగంపల్లి శివారులో ఓ మహిళ మెడలోనుంచి బంగారు గొలుసును దుండగులు అపహరించగా, ఆర్గొండలో ఓ మహిళ మెడలోనుంచి గోల్డ్చైన్ను దొంగిలించడానికి యత్నించారు.రామారెడ్డి చెందిన మనెమ్మ తన కుమారుడు భాస్కర్తో కలిసి బైక్పై రాజంపేట మండలం తలమడ్లలోని బంధువుల ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం తిరిగి స్వగ్రామానికి బయలుదేరగా, జంగంపల్లి వెనుక నుంచి వ్యక్తులు వీరి వద్దకు వచ్చి వారిని బస్వన్నపల్లి గ్రామానికి దారి కోసం అడిగి చోరికి పాల్పడ్డారు.