Logo
Download our app
వైద్యాధికారి పేరిట వసూళ్ల పర్వం
NEWS   Jan 18,2025 08:48 am
కామారెడ్డి జిల్లా వైద్యాశాఖ అధికారి పేరిట వసూళ్లకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. లింగంపేట మండల కేంద్రంలో ఆర్ఎంపీ, పీఎంపీల వద్ద ఓ వ్యక్తి వసూళ్లకు పాల్పడగా.. డీఎంహెచ్వో అక్కడ లేరని తెలియడంతో అసలు విషయం వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి పీహెచ్సీలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్గా బాలకృష్ణ పనిచేస్తున్నాడు. అతడు లింగంపేటలో ఓ వైద్యాలయం నిర్వహించే ఆర్ఎంపీ రషీద్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source