Logo
Download our app
పసుపు రైతుల అభివృద్ధికి కృషి
NEWS   Jan 18,2025 04:22 am
పసుపు రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని పసుపు బోర్డు జాతీయ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. మనోహరాబాద్‌లో స్థాపించిన జేఎంకేపీఎం పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఆయన సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రకృతి పర్యావరణ సంస్థ చైర్‌పర్సన్‌ జయశ్రీ, జేఎంకేపీఎం వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, డైరెక్టర్లు అల్లూరి సంతోష్‌, గడ్డం శ్రీనివాస్‌, రాజు, సామ గంగారెడ్డి పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source