సీఐడీ మాజీ చీఫ్ పై విచారణకు ఆదేశం
NEWS Jan 18,2025 03:59 am
ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ పై తీవ్ర అభియోగాలు మోపింది. ఈ మేరకు విచారణ చేపట్టాలని ఆదేశించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీశ్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.