అర్హులందరికీ రేషన్ కార్డులు
NEWS Jan 16,2025 06:58 pm
అర్హులందరికీ రేషన్ కార్డులు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కోరుట్ల మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ బలిజ పద్మా రాజారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ రావు, రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావుల ఆదేశాల మేరకు గురువారం వార్డులో అర్హత గల లిస్టు ప్రకారం నూతనంగా రేషన్ కార్డుల మంజూరి కొరకై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం10సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు.