Logo
Download our app
కొమిరెడ్డి జ్యోతి శ్రద్ధాంజలి మెమొంటోను అందజేసిన ఎమ్మార్వో
NEWS   Jan 16,2025 05:20 pm
మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి ప్రజలకు అందించిన సేవలను స్మరించుకుంటూ ఇటీవల అసెంబ్లీలో జ్యోతి దేవి మృతిపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అందించిన శ్రద్ధాంజలి మెమొంటోను స్థానిక తహసిల్దార్ చేతుల మీదుగా జ్యోతక్క తనయులు కొమిరెడ్డి కరంచంద్, విజయ్ ఆజాద్ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ హఫీజ్, అక్తర్ జానీ మెట్ పల్లి ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source