సర్వేను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
NEWS Jan 16,2025 10:49 am
కోరుట్ల మండలం సంగెం గ్రామంలో రైతు భరోసా, రేషన్ కార్డుల సర్వేను జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత పరిశీలించారు. జాబితాలో పేర్లు ఉన్న వారికి వివరాలు తెలియజేస్తూ క్షేత్ర స్థాయిలో వివరాలు తెలుసుకోవాలన్నారు. అర్హులందరికీ పక్కాగా సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అధికారులు పగడ్బందీగా సర్వే చేయాలన్నారు. ఆమె వెంట ఆర్డిఓ జివాకర్ రెడ్డి ఉన్నారు.