సమగ్ర వివరాలను సేకరించాలి
NEWS Jan 16,2025 10:29 am
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సమగ్ర వివరాలను సేకరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు, సర్వే బృందాలకు సూచించారు. సిరికొండ, దర్పల్లి మండలల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పులు లేకుండా వివరాలు సేకరించి నమోదు కార్యక్రమం చేయాలన్నారు.