భూముల పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్
NEWS Jan 16,2025 10:29 am
సాగుకు యోగ్యంగా లేని భూములను పరిశీలించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 107 లోని భూములను అధికారులతో కలిసి పరిశీలించారు. వివరాలు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిన మేరకు అధికారులు క్షేత్ర స్థాయిలోని భూములను పరిశీలించడం జరుగుతున్నదని తెలిపారు. గత రికార్డుల ఆధారంగా వ్యవసాయానికి అనువుగా లేని భూముల వివరాలు ఈ నెల 20 లోపు పరిశీలించాలన్నారు.