ఈడీ ముందు విచారణకు కేటీఆర్
NEWS Jan 16,2025 02:29 am
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించగా పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఏసీబీ, ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈడీ ముందు విచారణ కోసం హాజరు కానున్నారు కేటీఆర్. ఫెమా రూల్స్ అతిక్రమిస్తూ రూ. 55 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.