ఏపీ మహిళలకు బాబు ఖుష్ కబర్
NEWS Jan 16,2025 02:24 am
ఏపీ టీడీపీ కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. తల్లికి వందనం, రైతు భరోసాతో పాటు ఇప్పటికే మహిళల కోసం ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో ఎలా అమలవుతోందనే దానిపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పర్యటించి సీఎం నివేదిక సమర్పించింది. దీంతో మహిళలకు ఖుష్ కబర్ చెప్పనున్నారు బాబు.