తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం
NEWS Jan 16,2025 02:14 am
తిరుమల పుణ్య క్షేత్రంలో నకిలీ దర్శనం టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. రూ. 300 నకిలీ ప్రత్యేక దర్శనం టికెట్లను జారీ చేసినట్లు గుర్తించారు. నకిలీ టికెట్లు కలిగిన వారిని లోపలికి అనుమతిచ్చారు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది. దీనిపై విచారణ చేపట్టారు. నకిలీ టికెట్ల తయారీలో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బంది హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు టీటీడీ ఉన్నతాధికారులు.