అంగరంగ వైభోగం ప్రభల తీర్థం
NEWS Jan 16,2025 02:11 am
ప్రతి సంవత్సరం కనుమ నాడు జరిగే ప్రభల తీర్థం అనేది 400 ఏళ్ల నాటి ప్రాచీనమైన పండుగ . ఈసారి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి అమలాపురం ఎంపీ గంటి హరీష్ ,పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత , సాంస్కృతిక కమిషన్ చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి హాజరయ్యారు. ప్రభల తీర్థం పండుగను రాష్ట్ర పండుగగా మార్చాలని నిర్వాహకులు కోరారు.