మహా కుంభ మేళా రికార్డ్
NEWS Jan 16,2025 01:48 am
యూపీలోని ప్రయాగ్ రాజ్ అరుదైన ఘనతను స్వంతం చేసుకుంది. ఈనెల 13న మహా కుంభ మేళా ప్రారంభమైంతి. తొలి రెండు రోజుల్లోనే ఏకంగా 5.15 కోట్ల మంది దర్శించుకున్నారని యోగి ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచ చరిత్రలో ఇది ఓ రికార్డ్ అని పేర్కొన్నారు సీఎం . తొలి రోజు 1.65 కోట్ల మంది స్నానాలు చేయగా మకర సంక్రాంతి రోజున 3.50 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని తెలిపారు. ఎలాంటి హింస, తొక్కిసలాట, కుల మతాల ప్రస్తావన జరగలేదన్నారు.