ఖర్గేతో ఏపీపీసీసీ చీఫ్ షర్మిల భేటీ
NEWS Jan 15,2025 05:04 am
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా ఆమె ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. ప్రధానంగా కూటమి సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు ఖర్గే.