అయ్యప్ప మకర జ్యోతి దర్శనం!
NEWS Oct 08,2025 11:07 am
శబరిమల ఆలయంలో తిరువాభరణా ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబల మేడులో కందమల శిఖరంపై మకరజ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు మూడు సార్లు దర్శనమిచ్చారు. దీనితో స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. మకరజ్యోతిని వీక్షించేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములతో శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది.