వయసు పెరిగినా ఇంకా చిలిపి..
NEWS Jan 14,2025 05:33 pm
కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వయసు పెరిగినా చిలిపి చేష్టలు మాత్రం పోలేవని ఎంపీ అర్వింద్ విమర్శించారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఆయనకైనా తెలుసా? అంటూ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడం వల్లే పసుపు బోర్డు కార్యాలయం తెలంగాణలో సాకారమైందని మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలకు అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. చేతనైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన చెరుకు ఫ్యాక్టరీలను తుమ్మల తెరిపించాలన్నారు.