Logo
Download our app
నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభం
NEWS   Jan 14,2025 09:02 am
ఇందూరు పసుపు రైతుల దీర్ఘకాల కల ఎట్టకేలకు సాకారం అయింది. నిజామాబాద్ నగరంలో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభమైంది. పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీ 2023 అక్టోబరు 1వ తేదీన మహబూబ్ నగర్ బహిరంగ సభలో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబరు 4వ తేదీన కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ కాగా నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభీంచారు .
⚠️ You are not allowed to copy content or view source