Logo
Download our app
ఏపీలో ప‌లువురు ఐపీఎస్ లు బ‌దిలీ
NEWS   Jan 14,2025 03:50 am
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పాల‌నా ప‌రంగా పోలీస్ శాఖ‌లో ప‌లువురు ఐపీఎస్ ల‌ను బ‌దిలీ చేసింది. 2021-22 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐపీఎస్‌లను బ‌దిలీ చేసింది. చింతపల్లి ఏఎస్పీగా నవజ్యోతి మిశ్రా, నంద్యాల ఏఎస్పీగా మందా జావళి అల్ఫోన్, రాజంపేట ఏఎస్పీగా మనోజ్ రామ్‌నాథ్‌ హెగ్డే, కాకినాడ ఏఎస్పీగా దేవరాజ్ మనీష్, తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరిని బ‌దిలీ చేసింది. త‌క్ష‌ణ‌మే బాధ్య‌త‌లు స్వీక‌రించాల‌ని సీఎం ఆదేశాల మేర‌కు డీజీపీ ఉత్త‌ర్వులు జారీ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source