ఎమ్మెల్యే పాడిపై స్పీకర్ కు ఫిర్యాదు
NEWS Jan 13,2025 09:00 am
తనపై అందరూ చూస్తూ ఉండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాడికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. తక్షణమే పాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని కోరారు.