రికవరీ ఫోన్ అందజేసిన ఎస్సై
NEWS Jan 11,2025 10:43 am
కోరుట్ల: జోగిన్ పల్లి గ్రామానికి చెందిన Y. అజయ్ కుమార్ గత నెల 18న కోరుట్ల పట్టణంలో ఫోన్ పొగొట్టుకున్నాడు. ఈ మేరకు వెంటనే కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ లు రికవరీ చేసి శుక్రవారం బాధితుడికి కోరుట్ల ఎస్సై P. రామచంద్రం అందజేశారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించవచ్చని ఎస్ఐ తెలిపారు.