యూనివర్సిటీ ఈసీ నిర్ణయాలు ఎందుకు అమలు చేయడం లేదు
NEWS Jan 10,2025 03:43 pm
తెలంగాణ యూనివర్సిటీ ఈసీ నిర్ణయాలు ఎందుకు అమలు చేయడం లేదని నిజామాబాద్ పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈపదవి కాలం పూర్తయిన అడ్మినిస్ట్రేటివ్ పదవులు ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ డబ్బులు ఏమయ్యాయన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేశారు.