హరీష్ రావు క్వాష్ పిటిషన్ పై విచారణ
NEWS Jan 10,2025 05:47 am
ఎఫ్ఐఆర్ ను కొట్టి వేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసుకు సంబంధించి పోలీసులు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో హరీశ్ రావును అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశించింది. మంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ పోలీసులు ఆరోపించారు.