ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దు
NEWS Jan 09,2025 11:43 am
హోం మంత్రి వంగలపూడి అనిత తిరుపతి ఘటనపై స్పందించారు. తొక్కిసలాటకు సంబంధించి ఏమైనా కుట్ర కోణం ఉందా అనే దానిపై పరిశీలిస్తున్నామన్నారు. బాధ్యతా రహితంగా పని చేసినట్లు విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు. రుయా ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దన్నారు.