ప్రమాదవశత్తు బావిలో పడి బాలుడు మృతి
NEWS Jan 09,2025 09:50 am
మల్లాపూర్ లోని గొర్రె పెళ్లి గ్రామంలో ప్రమాదవశత్తు బావిలో పడి బాలుడు మృతి చెందాడు. స్థానికులు కథనం మేరకు. గ్రామానికి చెందిన నేదునూరి కార్తీక్ (14) నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు గాలించగా ఇవాళ ఉదయం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహం తేలుతూ కనిపించింది. మృతుడితండ్రి నేదునూరి రాజం పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై K. రాజు తెలిపారు.