మృతుల కుటుంబాలకు సర్కార్ పరిహారం
NEWS Jan 09,2025 08:16 am
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ సందర్బంగా తిరుపతిలో చోటు చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా 32 మందికి పైగా గాయపడ్డారు. రూయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా తివ్వనున్నట్లు ప్రకటించారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.