లక్షా 20 వేల టోకెన్లు జారీ చేశాం
NEWS Jan 09,2025 08:04 am
వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ జారీ చేసిన టోకెన్లు పూర్తయినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. నిర్దేశించిన కోటా పూర్తి కావడంతో కౌంటర్లను మూసి వేశామన్నారు. 3 రోజులకు గాను లక్షా 20 వేల టోకెన్లు జారీ చేశామన్నారు. 13వ తేదీ నుంచి తిరిగి టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈసారి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఈవో.