ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు
NEWS Jan 07,2025 07:59 am
దివంగత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చేశారంటూ నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. రూ. 3 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా కావాలని నిర్లక్ష్యం చేసిందంటూ ధ్వజమెత్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు లబ్ది చేకూర్చేలా పేదల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందని వాపోయారు. ఆరోగ్యశ్రీని వదిలించుకునేందుకే ఇలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.