Logo
Download our app
భూ సమస్యలు రెవెన్యూ సదస్సులతో పరిష్కారం
NEWS   Jan 07,2025 08:17 am
భూ సమస్యలు రెవెన్యూ సదస్సులతో పరిష్కారానికి నోచుకుంటున్నాయని రొళ్ల తాసిల్దార్ షేక్షావలి పేర్కొన్నారు. మంగళవారం రొళ్ల మండలం కాకి గ్రామపంచాయతీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. భూ సమస్యలను పరిష్కరించడంతోపాటు రెవెన్యూ పరమైన సేవలను ప్రజల చెంతకు చేర్చాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రెవెన్యూ సదస్సు చేపట్టిందన్నారు.భూ సమస్యల పరిష్కారానికి, మ్యుటేషన్కు, వివిధ ధ్రువ పత్రాల జారీకి ప్రజలు ప్రభుత్వానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
⚠️ You are not allowed to copy content or view source