చదువు ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్య
NEWS Jan 06,2025 05:15 pm
వేంపేట గ్రామంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి చదువుపై ఇష్టం లేక సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 15 రోజుల క్రితం ఇంటికి వచ్చిన అనంతరం కాలేజీకి వెళ్ళమని తల్లిదండ్రులు ప్రాదేయపడుతున్నా చదువుపై ఇష్టం లేక వెళ్ళలేదు. సోమవారం కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్ళిన వారితో పాటు మృతుడు కూడా మధ్యాహ్నం వరకు పొలం పనులకు వెళ్లి వచ్చాడని ఎస్ఐ తెలిపారు.