Logo
Download our app
దొంగ అన్నందుకు అత్తను చంపిన అల్లుడు
NEWS   Jan 06,2025 04:32 pm
తనను తరచుగా దొంగ అని అవమానించినందుకు అల్లుడు తన అత్తను చంపేశాడు. నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ లో జరిగిన వృద్ధురాలి హత్య కేసును 48 గంటల్లో చేదించారు. సారంగాపూర్ కు చెందిన దుబ్బాక సాయమ్మ (62) ఈ నెల 3న తన ఇంట్లో హత్యకు గురయ్యారు. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సాయమ్మ 2వ కూతురి భర్త లక్ష్మణ్ గతంలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి జైలుకు కూడా వెళ్లినట్లు తెలిపారు. ఇప్పటివరకు అతనిపై 30కి పైగా కేసుల నమోదు అయినట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source