అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 51 లక్షల విరాళం
NEWS Jan 06,2025 06:39 am
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు గుంటూరుకు చెందిన భాష్యం డెవలపర్స్ సంస్థ డైరెక్టర్ డి. కస్తూరి రూ. 51 లక్షల విరాళాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్బంగా దాతను ప్రత్యేకంగా అభినందించారు.