పంచాయతీ భవన నిర్మాణంకి శంకుస్థాపన
NEWS Jan 05,2025 06:17 am
పిట్లం మండలం అన్నారం గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని బుర్నాపూర్ గ్రామ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి ఇటీవల మరణించారు. వారి ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గోద్మేగావ్ గ్రామానికి చెందిన యువ నాయకులు ఈశ్వర్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు.