విశాఖ నావెల్ కమాండ్ భేష్
NEWS Jan 05,2025 03:30 am
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖ నావెల్ కమాండ్ పనితీరు అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. 1971లో జరిగిన భారత్ - పాకిస్తాన్ యుద్దంలో అత్యంత కీలకంగా పని చేసిందన్నారు. ఇది చరిత్రలో మిగిలి పోయిన సంఘటన అన్నారు. దేశ రక్షణకే కాదు ఏ విపత్తు వచ్చినా సహాయక చర్యల్లో ముందంజలో ఉంటుందన్నారు. హుద్హుద్ తుఫాను సహాయక చర్యల్లో నేవీ చూపించిన చొరవ ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు సీఎం.