ఘనంగా లూయి బ్రెయిలీ జయంతి వేడుక
NEWS Jan 04,2025 03:29 pm
ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలోని గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో లూయీ బ్రెయిలీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఎలీషా మాట్లాడుతూ.. అంధులు సైతం సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఆశయంతో వారి భవిష్యత్తు కొరకు ప్రత్యేక లిపిని రూపొందించిన లూయి బ్రెయిలీ జయంతి ప్రతి సంవత్సరం జనవరి 4న జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.