పోలవరం నిర్మాణంపై ఐఐటీ టీం ఏర్పాటు
NEWS Jan 04,2025 11:16 am
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణపై పడే ప్రభావం గురించి ఐఐటీ హైదరాబాద్ టీమ్తో నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై అధ్యయనం చేయాలని సూచించారు. ఏపీ సర్కార్ కొత్తగా చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు గురించి ఆరా తీశారు.