సిడ్నీ టెస్టులో గాయపడిన బుమ్రా
NEWS Jan 04,2025 06:04 am
ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్టులో స్టాండింగ్ కెప్టెన్ గా ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తీవ్రంగా గాయపడ్డాడు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్ కాగా మైదానంలోకి దిగిన ఆస్ట్రేయా బ్యాటర్లు దూకుడు పెంచారు. ఈ తరుణంలో బౌలింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలను కోహ్లీకి అప్పగించారు.