ప్రధాని మోడీని కలిసిన కోనేరు హంపి
NEWS Jan 04,2025 05:44 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఢిల్లీలో కలిశారు చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి. తాజాగా న్యూయార్క్ లో జరిగిన మహిళల ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ సందర్భంగా కోనేరు హంపిని ప్రశంసించారు పీఎం. ఔత్సాహిక క్రీడాకారులకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. ఇదిలా ఉండగా తమిళనాడుకు చెందిన గుకేష్ దొమ్మరాజు అతి పిన్న వయసులోనే చెస్ ఛాంపియన్ గా నిలిచి రికార్డ్ సృష్టించాడు.