జనవరి 9న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు
NEWS Jan 04,2025 06:54 am
జనవరి 9న రైతుకూలి సమస్యల పరిష్కారానికి ఆందోళన చేయాలనీ రైతు కూలీ సంఘం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ మార్కెట్ పసుపు కొనుగోలుదారులు కమిషన్ దారులు ప్రతి సంవత్సరం సిండికేట్ అవతారం ఎత్తి కృత్రిమంగా ధరలు తగ్గించి రైతులని నిండా ముంచుతున్నారని ఆరోపించారు. పదేపదే చెబుతున్న అధికారులు గానీ అధికార పార్టీ గానీ స్పందించిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ రోజుగా జనవరి 9న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేయాలని కోరారు. నిజాంబాద్ లో జరిగే ఆందోళనలో రైతుల పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు