గురుకుల విద్యార్థులపై చెయ్యి చేసుకున్న పీఈటి
NEWS Jan 03,2025 09:34 am
గురుకుల పాఠశాలలో విద్యార్థులపై పిఈటి దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెట్ పల్లి పట్టణం లోని వెంకట్రావు పెట్ కాలనీలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో బుధవారం ఉదయం తొమ్మిదో తరగతి విద్యార్థులను వ్యాయామం చేయాలనీ పీఈటి నిద్ర లేపే క్రమంలో విద్యార్థులు నిరకరించారు. కోపానికి గురైన (పీఈటి) బెత్తంతో విద్యార్థులపై దాడికి దిగాడు. విద్యార్థులకు చేతులకు వీపు భాగంలో స్వల్ప గాయాలవడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వచ్చి తీసుకెళ్లారు.