మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
NEWS Jan 02,2025 10:09 am
మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మల్లాపూర్ మండలంలో చోటుచేసుకుంది. మొగిలిపేటకు చెందిన తోకల తాతయ్య(58) గత కొంతకాలంగా మద్యానికి బానిసవడంతో భార్య, కుమారులు మందలిస్తున్నారు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.