కోలుకుంటున్న శ్రీతేజ్
NEWS Jan 01,2025 04:42 am
పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు మంత్రి దాసరి సీతక్క. డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మరింత మెరుగు పడిందన్నారు. వెంటిలేటర్ చికిత్స నుంచి శ్రీతేజ్ బయటకి వచ్చాడని అన్నారు. తన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.