అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఎస్సై
NEWS Dec 31,2024 05:59 am
ఇబ్రహీంపట్నం: డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల పేర్లతో చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై అనిల్ కుమార్ హెచ్చరించారు. మండలంలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. రోడ్లపై కేక్ కట్ చేయడం, టపాసులు పేల్చితు చట్టరీత్యా నేరమన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు.