అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి: మంత్రి
NEWS Dec 31,2024 08:22 am
అధికారులు రెవిన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చిన్నమండెం మండలంలోని బొరెడ్డిగారి పల్లెలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. భారీ ఎత్తున ప్రజల విచ్చేసి మంత్రికి తమ సమస్యలను విన్నవించారు. వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.