Logo
Download our app
న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి
NEWS   Dec 30,2024 05:50 pm
నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని మల్యాల ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపారు. అలాగే మండల ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. డిసెంబర్ 31న రోడ్లపై కేక్ లు కట్ చేయడం, మద్యం తాగి వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటివి చేయరాదన్నారు. 31వ తేదీ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తామని, పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు.
⚠️ You are not allowed to copy content or view source