తెలంగాణ జాగృతి పేరుతో నిలువు దోపిడి
NEWS Dec 30,2024 11:21 am
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిప్పులు చెరిగారు సీనియర్ లీడర్ ఇందిరా శోభన్. తెలంగాణ జాగృతి సంస్థ (ఎన్జీవో) పేరుతో వందల కోట్లు వెనకేసుకుందని ఆరోపించారు. కేంద్రం నుంచి ఏకంగా రూ. 3 వేల కోట్లు తెచ్చుకున్నారని, ఎంత మందికి ఉపాధి కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో మోసం చేసిన ఆమె సంస్థ పేరుతో మళ్లీ మోసం చేసేందుకు రెడీ అయ్యిందన్నారు.